Don't Miss!
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
భయపడిన శ్యామ్ సింగరాయ్ మేకర్స్.. కీలక మార్పులతో నాని అప్సెట్?
నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఒక స్పెషల్ బ్రాండ్ అయితే సెట్ చేసుకున్నాడు. ఇక వచ్చే ఏడాది వరుసగా డిఫరెంట్ సినిమాలను వదలబోతున్నాడు. V సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూసిన నానికి లాక్ డౌన్ కారణంగా చివరికి ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సినిమా ఆడియెన్స్ ని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.
ఇక నెక్స్ట్ అంతకు మించి అనేలా డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్న నేచురల్ స్టార్ ఒక సినిమాపై మాత్రం చాలా నమ్మకంతో ఉన్నాడట. అదే శ్యామ్ సింగరాయ్. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథకు తగ్గట్లు బడ్జెట్ కొంచెం భరిగా సెట్ చేయగలిగితేనే వర్కౌట్ అవుతుందట.
అసలు విషయంలోకి వస్తే సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్న ప్రముఖ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ చివరి నిమిషంలో తప్పుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ మరీ ఎక్కువవుతోందని మరో నిర్మాతకి అప్పగించేశారట. ఈ విషయంలో నాని కొంత అప్సెట్ అయినట్లు టాక్. అయితే సినిమా షూటింగ్ ని టాక్ జగదీష్ ఫినిష్ చేసిన తరువాత స్టార్ట్ చేయాలని నాని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమాలో హీరోకు సమానంగా ఉండే ఒక పవర్ఫుల్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోందని టాక్. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.