Don't Miss!
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
భయపడిన శ్యామ్ సింగరాయ్ మేకర్స్.. కీలక మార్పులతో నాని అప్సెట్?
నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఒక స్పెషల్ బ్రాండ్ అయితే సెట్ చేసుకున్నాడు. ఇక వచ్చే ఏడాది వరుసగా డిఫరెంట్ సినిమాలను వదలబోతున్నాడు. V సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూసిన నానికి లాక్ డౌన్ కారణంగా చివరికి ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఆ సినిమా ఆడియెన్స్ ని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.
ఇక నెక్స్ట్ అంతకు మించి అనేలా డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్న నేచురల్ స్టార్ ఒక సినిమాపై మాత్రం చాలా నమ్మకంతో ఉన్నాడట. అదే శ్యామ్ సింగరాయ్. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథకు తగ్గట్లు బడ్జెట్ కొంచెం భరిగా సెట్ చేయగలిగితేనే వర్కౌట్ అవుతుందట.
అసలు విషయంలోకి వస్తే సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్న ప్రముఖ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ చివరి నిమిషంలో తప్పుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ మరీ ఎక్కువవుతోందని మరో నిర్మాతకి అప్పగించేశారట. ఈ విషయంలో నాని కొంత అప్సెట్ అయినట్లు టాక్. అయితే సినిమా షూటింగ్ ని టాక్ జగదీష్ ఫినిష్ చేసిన తరువాత స్టార్ట్ చేయాలని నాని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమాలో హీరోకు సమానంగా ఉండే ఒక పవర్ఫుల్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోందని టాక్. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.