Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తన పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసిన నాని! రీ వర్క్ చేస్తున్న గురువు
నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' విజయంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పేశాడు. 'గ్యాంగ్ లీడర్' టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టైటిట్ టీజర్, ప్రీలుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ సాగుతుండగానే, తనను చిత్రసీమకు పరిచయం చేసిన ఇంద్రగంటి సినిమాకు కొద్దిరోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. ఈ సినిమాకు 'వీ' అనే టైటిల్ పెట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీళ్లిద్దరి సరసన నివేదా థామస్, అతిథి రావు హైదరీ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత భాగాన్ని గచ్చిబౌలిలో తెరకెక్కించారు.
ఈ సినిమాలో నాని విలన్గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని అతడే పరోక్షంగా వెల్లడించాడు. సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న రోజు ట్విట్టర్ ద్వారా ''నన్ను హీరోగా పరిచయం చేసింది ఈయనే. ఈరోజు నా 25వ సినిమానూ డైరెక్ట్ చేస్తున్నాడు. కానీ, ఈ సారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం'' అని పోస్ట్ చేశాడు. దీంతో నాని విలన్గా కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ లెక్కన ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో అని కూడా వార్తలు వచ్చాయి.
అయితే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తీరుపై నాని అభ్యంతరం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన షూట్ రష్ వర్క్ చూసిన నాని.. తనకంటే సుధీర్ బాబు పాత్రకు ఎక్కకువ ప్రాధాన్యత ఉన్నదన్న విషయాన్ని గ్రహించాడట. అసలే తన 25వ సినిమా కావడంతో తన పాత్ర పరిధి పెంచాలని దర్శకుడితో మాట్లాడాడని సమాచారం. దీంతో ఇంద్రగంటి ఈ స్క్రిప్టుకు రీ వర్క్ చేస్తున్నారని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.