Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాని పాన్ ఇండియా మూవీ, మొదలవ్వకముందే అనుమానాలు.. ఆశలన్నీ ఆవిరైనట్లేనా..?
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ చాలా డిఫరెంట్ గా వెళుతుందనే చెప్పాలి. రెగ్యులర్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తే.. డిఫరెంట్ సినిమాలు చేయడం లేదు అంటారు. ఒకవేళ ప్రయోగాత్మక సినిమాలు చేస్తే నాని మార్క్ కామెడీ సీన్స్ సినిమాలో లేవని కూడా అంటారు. అందుకే నాని రెండింటిని మిక్స్ చేసి అలాగే ఎమోషనల్ కథలను కూడా చేస్తున్నాడు.
Recommended Video
గ్యాంగ్ లీడర్ తో సెట్టయ్యాడు గాని..
వరుస అపజయాల అనంతరం నాని మొత్తానికి గ్యాంగ్ లీడర్ సినిమాతో పరవాలేదనిపించాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఇంకా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. కానీ నాని మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని ఆ చిత్రం నీరూపించింది. కంటెంట్ క్లిక్కయ్యుంటే సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టేది.
బిగ్ బడ్జెట్ మూవీ..
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో అదే ప్రొడక్షన్ లో మరో సినిమా చేయాలని నాని కమిట్ అయ్యాడు. నానితో బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని అనుకున్న నిర్మాతలకు టాక్సీ వాలా డ్రైవర్ రాహుల్ సాంకృత్యాన్ ఒక పిరియడిక్ కథ చెప్పడంతో వెంటనే సినిమాను ఎనౌన్స్ చేశారు.
పాన్ ఇండియా ప్లాన్..
ఇక రాహుల్ కథ ఫైనల్ చేసిన అనంతరం నాని తన సినిమా టైటిల్ కోసం చాలా రోజులు చర్చించాడు. ఫైనల్ గా శ్యామ్ సింగరాయ్ టైటిల్ ని సెట్ చేయడంతో సినిమాపై స్పెషల్ బజ్ మొదలైంది. అలాగే సినిమా పిరియడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుందని తెలియడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి నిర్మాతలు కూడా నాని మార్కెట్ ని లెక్క చేయకుండా హై బడ్జెట్ లో సినిమాను ప్లాన్ చేసుకున్నారు. కుదిరితే పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేయాలని కూడా అనుకున్నారట.
నాని ఆశలన్నీ ఆవిరైనట్లేనా..?
నాని కెరీర్ లో కూడా పాన్ ఇండియా మూవీ రానున్నట్లు ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఒక టాక్ బాగా వైరల్ అయ్యింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా నిర్మాతలు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత కూడా సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదని సమాచారం. ఏడాది పాటు కరోనా పూర్తిగా అంతమయ్యే వరకు సినిమాలు థియేటర్స్ కి వచ్చేలా లేవు. ఒకవేళ వచ్చినా జనాలు ఎంతవరకు పట్టించుకుంటారు అనేది బిగ్ ట్విస్ట్. అందుకే మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ చేయడానికి సిద్ధం లేరని రూమర్స్ వస్తున్నాయి. దీంతో నాని పాన్ ఇండియా ఆశలన్నీ ఆవిరయ్యే అయ్యే ఛాన్స్ ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.