Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విశాఖలో మెగాస్టార్ చిరంజీవికి ట్రీట్మెంట్.... అంతా రహస్యం?
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టారు. ఇక సినిమాల్లోనే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. రాజ్య సభ ఎంపీగా ఉండి కూడా ఆయన ఇటీవల కేంద్ర బడ్జెట్ మీదగానీ, ఏపీకి జరుగుతున్న అన్యాయంపైగానీ స్పందించలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆయన గురువారం జరిగిన ఏపీ బంద్లో కూడా పాల్గొనలేదు. ప్రస్తుతం చిరంజీవి దృష్టంతా తన తాజా చిత్రం 'సైరా' మీదనే ఉంది. ఈ సినిమా కోసం ఆయన పిట్నెస్ పరంగా, లుక్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
విశాఖలో చిరంజీవికి ట్రీట్మెంట్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్రీట్ మెంట్ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్ వెళుతున్నట్లు తెలుస్తోంది. నేచురోపతి ట్రీట్ మెంట్ కోసం ఆయన అక్కడకు వెళ్లబోతున్నారని టాక్.
ఎందుకీ చికిత్స?
‘సైరా' సినిమాలో చిరంజీవి యంగ్ లుక్తో కనిపించాలి. ఇందులో భాగంగానే ఆయన ఈ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారట. ఈ చికిత్స ద్వారా శరీరం కాంతివంతం అవుతుందని, స్కిన్ రేడియేట్ అవుతుందని అంటున్నారు.
అంతా రహస్యంగా...
అయితే ఈ ట్రీట్మెంట్ విషయాన్ని యూనిట్ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. బయటకు తెలిస్తే దీని గురించి మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు సమాచారం.
శరవేగంగా షూటింగ్
‘సైరా' చిత్రం కాస్త లేటుగా ప్రారంభం అయినా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా..... ఫిబ్రవరి నుండి నుండి సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మెగా తనయుడు రామ్ చరణ్ చిత్ర నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు.
అంచనాలు భారీగా
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రనటులు నటిస్తున్నారు.
నేషనల్ లెవల్లో 150 కోట్ల ఖర్చుతో
కొణిదెల ప్రొడక్షన్స్లో 150 కోట్ల బడ్జెట్తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని రామ్ చరణ్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేషనల్ లెవల్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం ఉంది.