twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ కి 'నొ' చెప్పిన నయనతార

    By Staff
    |

    Nayantara
    'భిల్లా' రీమేక్ లో నటించటానికి నయనతార నొ చెప్పిందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్నాయి. ఈ చిత్రం ప్రభాస్ హీరోగా కంత్రి దర్శకుడు మెహర్ రమేష్ రూపొందించనున్నారనే సంగతి తెలిసిందే. ఇక అజిత్ హీరోగా తమిళంలో విష్ణువర్ధన్ రూపొందించిన ఈ సినిమా అతనికి కోల్పోయిన స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. దాంతో వరస పరాజయాల ప్రభాస్ తాజాగా ఈ సినిమా రీమేక్ కి కమిటయ్యారు. అయితే ఆ సినిమా విజయంలో ఈక్వెల్ షేర్ నయనతారది. దాంతో ప్రభాసే ఆమెను స్వయంగా ఎప్రోచ్ అయి అడిగాడని తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం చాలా పొలైట్ గా ఈ ఆఫర్ ని తరిస్కరించిందిట.

    అయితే నయనతార కాదనటానికి కారణం తిరిగి అదే పాత్రను చేసినా ఆ రేంజి మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా అనే అనుమానంతోనట. ఎందుకంటే ఆమె చేసిన ఈ పాత్ర ద్వారా అక్కడో కొత్త తరహా ట్రెండు స్టార్టయింది. ఆ పాత్ర ఇక్కడ వర్కవుట్ కాకపోతే తన చేతులతో తనే చెడ కొట్టినట్లు అవుతుందని ఆమె భావిస్తోందిట. అదే వేరే వాళ్లు చేస్తే నయనతార గొప్పగా చేసింది ఆమెను ఎక్కడ అందుకోగలరు అనే టాక్ వస్తుందనే ఆశతో ఉందని దగ్గరవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. పైకి మాత్రం డైట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చెప్పిందిట.అమితాబ్ డాన్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ని ప్రభాస్ తమ సొంత బ్యానర్ అయిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై చేయనున్నారు. అయితే ఇప్పుడు అనూష్క ఈ ప్లేసులోకి రావచ్చుననేది సారాంసం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X