Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
హాట్ స్టార్ నయనతారకు తెలంగాణా భయం?
మళయాళి బ్యూటీ నయనతారకు ఈ తెలంగాణ ఇష్యూ మొదలైన దగ్గరనుంచీ టెన్షన్ పట్టుకుందని సమాచారం. పొలిటికల్ గా ఆమెకు ఆసక్తి లేకపోయినా ఆమె ఆస్తులు కొన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉండటమే ఈ టెన్షన్ కు కారణమంటున్నారు. అక్కడ ఆమె సినీ పరిశ్రమలోని కొందరి సన్నిహితుల సహకారంతో కొన్ని భూమలు కొంది. మంచి రేటు వస్తే అమ్మి బాగుపడదామని ఎదురుచూస్తోంది. అయితే గత సంవత్సరకాలంగా రియల్ ఎస్టేట్ వేడి లేకపోవటంతో అమ్మలేదు. తాజాగా ఆమె తెలంగాణ ఇష్యూ స్టార్టవగానే అమ్మి వదిలించుకుందామనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పుడు కొనేవారు కనపడటం లేదుట.
అంతేగాక నయనతార కొన్న రేటులో సగం కూడా బేరం రావటం లేదని చెప్తున్నారు. ఆమె చేత కొనిపించిన సన్నిహిత దర్శకుడు ఈ టాపిక్ పై అస్సలు మాట్లాడటం లేదని తెలుస్తోంది. దాంతో వాటిని ఎలా వదిలించుకోవాలా అని రియల్ ఎస్టేట్ చూసే కొందరు హీరోలకు పోన్స్ చేస్తోందని చెప్తున్నారు. అయితే ఈ గొడవలు ఆగేదాకా ఆగమని వారు సలహాలు ఇస్తున్నారని చెప్తున్నారు. అందులోనూ ఆ భూములు ఆమె పేర లేకుండా బినామీ పేర్ల మీద ఉన్నాయని,రేపు తెలంగాణా వస్తే మరింత రేట్లు పడిపోతాయని ఆమెకు బెంగపట్టుకుంది. దాంతో ఎప్పటికప్పుడు ఆసక్తి లేకపోయినా టీవీ వార్తుల తెలిసికుంటోందని వినికిడి.