Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నయన-ప్రభుదేవాల 'లవ్వాట’ చాలా గాఢమైందేనేమో!!
నయనతార, ప్రభుదేవా మరోసారి సన్నిహితంగా కెమేరా చిక్కారు. హైదరాబాదులో సౌత్ స్కోప్ స్టయిల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీళ్లిద్దరూ ప్రక్కప్రక్కనే కూచుని పదే పదే ఒకరి చెవిలో ఒకరు గుసగుసమని ఊసులాడుతూ కనిపించారు. దీంతో అందరి కళ్లూ వీళ్లద్దరినే చూడటం మొదలుపెట్టాయి.
అయితే ఇదేమీ పట్టని నయనతార, ప్రభుదేవాలు మాత్రం తమదైన లోకంలో విహరించారు. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకూ గొంకూ లేక ఒకరిప్రక్కన ఒకరు కూచుని ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వీరి వ్యవహార శైలిని చూసిన టాలీవుడ్ సినీజనం, ఇద్దరి మధ్య 'లవ్వాట" నడుస్తున్న సంగతి నిజమే అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మొన్న ఆ మధ్య నయనతార ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ...ప్రభుదేవా అంటే తనకు పిచ్చప్రేమ అని పలికింది. అంతేకాదు ప్రభుదేవా భార్య తనపై మండిపడిందన్న వార్తలను తేలిగ్గా కొట్టి పారేసిందట. తను నటిని కాక ముందు నుంచే ప్రభుదేవా టాప్స్టార్ అనీ, అతని డ్యాన్సుకు తాను కాలేజీ రోజుల్లోనే ప్లాటయ్యానని చెప్పుకొచ్చిందట. ఇప్పుడు నేరుగా చూసింది కనుక ప్లాటుమీద ప్లాటయ్యిందన్నమాట.