అనుష్క-క్రిష్ బంధాన్ని నయన చెడగొట్టిందా?(ఫోటో ఫీచర్)
చెన్నై: హాట్ హీరోయిన్ అనుష్క, దర్శకుడు క్రిష్ మధ్య 'సం'బంధం ఉన్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వేదం సినిమాలో కలిసి పని చేసిన ఈ ఇద్దరి మధ్య స్నేహం కాస్తా...ఇంకాస్తా ముదిరి ప్రేమ బంధానికి దారి తీసిందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా వీరి రిలేషన్ షిప్ నయనతార మూలంగా దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం క్రిష్-నయనతార 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో కలిసి పని చేస్తున్నారు. సినిమా సెట్లో ఇద్దరు కాలా క్లోజ్గా స్నేహితుల్లా మెలుగుతూ ఉంటారు. అయితే వీరు ఇలా క్లోజ్ గా మూవ్ అవ్వడాన్ని అనుష్క సహించ లేకపోతోందట. అందుకే క్రిష్కు దూరంగా ఉంటోందట. దీంతో ఈ ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ఇద్దరిని మధ్య సఖ్యత కుదిర్చేందుకు ట్రై చేస్తున్నారట.

కిష్ తో నయనతార
నయనతార, క్రిష్ మంచి స్నేహితులు. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో బాగా దగ్గరయ్యారు.

నయనతార
ప్రభుదేవాతో రిలేషన్ కట్ అయిన తర్వాత నయనతార తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది.

నయనతారతో క్రిష్
అనుష్క, క్రిష్ తమ బంధాన్ని ఎప్పుడు బయట పడనీయలేదు. వీరి మధ్య స్నేహాన్ని మించిన ఏదో ‘సం'బంధం ఉందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు నయనతార క్రిష్ కు దగ్గరవుతుందని అంటున్నారు.

గతంలో అనుష్కకు నాగార్జున, నాగచైతన్య, గోపీ చంద్, ప్రభాస్ తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అవన్నీ అవాస్తవాలే అని తేలి పోయింది. క్రిష్ తో సంబంధంపై నిజా నిజాలు తేలాల్సి ఉంది.

ఇక నయనతార ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి వరకు వచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో నయన తమిళ నటుడు శింబును లవ్ చేసింది.


Click it and Unblock the Notifications











