Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు: జోడీగా ఆమె ఫిక్స్.. సోదరిగా సీనియర్ నటి
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. దీనికి కారణం ఆయన వరుసగా ఎన్నో ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటుండడమే. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీనియర్ హీరో.. ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రం పట్టాలపై ఉన్న సమయంలోనే చిరంజీవి మరో ముగ్గురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.
అతడికి ముద్దు పెట్టి బుక్కైన శ్రీముఖి: తెర వెనుక జరిగిన దానిపై నోరు విప్పన యాంకర్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మరో చిత్రమే 'లూసీఫర్' రీమేక్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్లో.. మరో హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ విడుదలైంది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమానే చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్, హనుమాన్ జంక్షన్ ఫేం మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.
మోహన్ లాల్ నటించిన 'లూసీఫర్' మూవీలో హీరోయిన్ పాత్ర ఉండదు. కానీ, తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు జరిపినప్పుడు హీరోకు జోడీగా ఓ పాత్రను క్రియేట్ చేశారు. దీని కోసం ఓ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అందులో లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు కూడా ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్రకు ఆమెనే తీసుకున్నారట. ఇప్పటికే దీనిపై ఈ స్టార్ హీరోయిన్ సంతకం కూడా చేసేసిందనే టాక్ వినిపిస్తోంది.
ఇక, 'లూసీఫర్' మూవీలో మంజూ వారియర్ పోషించిన హీరో సోదరి పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అందులో ఆమె తనదైన శైలి యాక్టింగ్తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో చిరంజీవి నటిస్తోన్న రీమేక్లో దీని కోసం ఎవరిని తీసుకుంటున్నారన్న దానిపై చాలా రోజులుగా ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటి సుహాసని పేరు బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఆమెనే ఇందులో చిరంజీవి సోదరిగా నటిస్తుందని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుందని టాక్.
ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!
Recommended Video
పొలిటికల్ బ్యాగ్డ్రాప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్లో చక్రం తిప్పే ఓ డాన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోకు సహకరించే డాన్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు ఈ మధ్య ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.