Nayanthara: పెళ్లి తర్వాత నయనతార షాకింగ్​ నిర్ణయం!.. అభిమానుల్లో టెన్షన్​..

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో లేడి సూపర్​ స్టార్​గా పేరు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్​ నయనతార. సుమారు 17 ఏళ్లుగా సినీ రంగంలో విభిన్నమైన సినిమాలు చేస్తూ మాలీవుడ్​ టు టాలీవుడ్​ వయా కోలీవుడ్​ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఇటీవల కోలీవడ్​ డైరెక్టర్​ విఘ్నేష్​ శివన్​ను పెళ్లాడి, వివాహ బంధంలో మునిగితేలుతున్న నయనతార తాజాగా అభిమానులకు షాకింగ్​ న్యూస్​ చెప్పనుందని టాక్ వినిపిస్తోంది.

లేడి సూపర్ స్టార్​గా..

లేడి సూపర్ స్టార్​గా..


నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు కావోస్తుంది. దక్షిణ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేసి సౌత్​ ఇండియా లేడి సూపర్​ స్టార్​గా స్టార్​డమ్​ సంపాందించుకుంది. ఇక తాజాగా ఆమె బాలీవుడ్​లో కూడా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.

షారుక్ ఖాన్​తో హిందీలోకి ఎంట్రీ..

షారుక్ ఖాన్​తో హిందీలోకి ఎంట్రీ..

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​ సరసన జవాన్ అనే చిత్రంలో నయనతార హీరోయిన్​గా చేయనుంది. ఇదే కాకుండా తెలుగులో మెగాస్టార్​ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న గాడ్​ ఫాదర్ మూవీలో చిరుకు చెల్లెలిగా నయనతార నటించిన విషయం తెలిసిందే. అలాగే తమిళంలో నయనతార చేసిన గోల్డ్​ అనే చిత్రం ఈ సెప్టెంబర్​ 8న విడుదల కానుంది.

షాకింగ్​ డెసిషియన్​..

షాకింగ్​ డెసిషియన్​..

ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు నయనతార సైన్ చేసింది. అయితే ఈ క్రమంలోనే నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తన యాక్టింగ్​ కెరీర్​కు స్వస్తి పలకనుందని సినీ వర్గాల భోగట్టా. అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక తన యాక్టింగ్​కు గుడ్​బై చెప్పనుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

బిజినెస్​ వుమెన్​గా..

బిజినెస్​ వుమెన్​గా..


నయనతార తన యాక్టింగ్​ కెరీర్​కు ఎండ్​ కార్డ్​ వేసి వ్యాపారవేత్తగా మారాలాని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు సినిమాలను కూడా నిర్మించాలను నయనతార భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై అధికారికంగా ప్రకటనంటూ ఏం లేదు గానీ, పుకార్లు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

అభిమానుల్లో టెన్షన్​..

అభిమానుల్లో టెన్షన్​..

దీంతో నయనతార అభిమానులు టెన్షన్ పడుతున్నారట. ఇదిలా ఉంటే మాలీవుడ్​, కోలీవుడ్, టాలీవుడ్​ సినిమాల్లో మొదటగా గ్లామరస్​ పాత్రలతో ఆకట్టుకున్న నయన్​.. తర్వాత నటన ఉన్న పాత్రలు చేసి శభాష్ అనిపించుకుంది. వివిధ చిత్రసీమ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకునే రేంజ్​కు ఎదిగింది.

 అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్​గా..

అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్​గా..

ఇక దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్​గా నయనతార పేరు గడించింది. కాగా ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్​ శివన్​ను సాంప్రాదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది నయనతార. ఇటీవల విఘ్నేష్​ శివన్​ దర్శకత్వం వహించిన కణ్మణి రాంబో ఖతీజా సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో నయనతారతోపాటు స్టార్ హీరోయిన్​ సమంత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X