twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతారకు భారీగా ముట్టజెప్పిన రామ్ చరణ్! ఎన్ని కోట్లో తెలుసా..? వైరల్ న్యూస్

    |

    సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్‌గా కొనసాగుతోంది అందాల సుందరి నయన తార. గత కొన్నేళ్లుగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ.. దక్షిణ భారత అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడిదే ప్రథమ స్థానం. తాజాగా ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి కోసం ఓ రేంజ్ పారితోషికం అందుకుందట నయనతార.

    సైరా నరసింహా రెడ్డి.. చిరంజీవి భార్య

    సైరా నరసింహా రెడ్డి.. చిరంజీవి భార్య

    సైరా నరసింహా రెడ్డి మూవీని 1857 బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి భార్య సిద్దమ్మ పాత్ర పోషించింది నయనతార.

    భారీగా ముట్టజెప్పిన రామ్ చరణ్

    భారీగా ముట్టజెప్పిన రామ్ చరణ్

    ఈ సినిమాలో నటించినందుకు గాను భారీ పారితోషికం అందుకుందట నయనతార. ఆమెకు నిర్మాత రామ చరణ్ ఏకంగా 6 కోట్లు ఇచ్చుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా అంగీకారం సాయమయంలోనే ఈ మేర కావాలని నయన్ కోరడంతో వెంటనే ఓకే చెప్పిన చెర్రీ.. అంత మొత్తం ముట్టజెప్పారని సమాచారం.

    5 భాషల్లో సైరా నరసింహా రెడ్డి

    5 భాషల్లో సైరా నరసింహా రెడ్డి

    మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింది సైరా నరసింహా రెడ్డి చిత్రం. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇలా ఏకంగా 5 భాషల్లో విడుదల కాబోతున్న తొలి తెలుగు సినిమాగా 'సైరా నరసింహారెడ్డి' రికార్డు నమోదు చేయనుంది.

    ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

    ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

    గతంలో ఎన్నడూ ఏ సినిమాకు చేయని రీతిలో 'సైరా నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అత్యంత గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీన ఈ వేడుకను కర్నూలులో నిర్వహించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    సైరా నరసింహా రెడ్డి మూవీ విశేషాలు

    సైరా నరసింహా రెడ్డి మూవీ విశేషాలు

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy movie creating sensations before release. As per latest talk this movie pre release event will be very much grandly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X