బ్రేకప్: నయనతార గురించి మరో షాకింగ్ న్యూస్!
హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార.
'నానుం రౌడీ దాన్' చిత్రంలో నటించిన నయనతార ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడిందని, ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే ప్రచారం జరిగింది. .
గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారంలో నయనతారకు కొన్ని షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే విఘ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం విషయంలో ఆమె గోప్యత పాటిస్తోందని నిన్నమొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఇద్దరికి బ్రేకప్ అయినట్లు తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
పెళ్లి చేసుకుందాం అని విఘ్నేష్ శివన్ పట్టుబట్టాడని, సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న తాను మరో మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోనని నయనతార వాదించింది... ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దదై విడిపోయారని అంటున్నారు.

నయన-విఘ్నేష్
నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని గత కొంతకాలంగా వార్తలు విపిస్తున్నాయి.

బయట పడలేదె
అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ఎప్పుడూ కూడా ఖరారు చేయక పోవడంతో అదో రూమర్ గానే మిగిలిపోయింది.

అలా..
'నానుం రౌడీ దాన్' చిత్రంలో నటించిన నయనతార ఈ క్రమంలో దర్శకుడికి క్లోజ్ అయిందట.

పెళ్లి జరిగినట్లు
ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు.

వివాహం
ఇద్దరూ 2016 వివాహం చేసుకుంటారని అనుకున్నారు... అంతలోనే బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











