Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
ధనుష్ హీరోగా తమిళంలోకి నీది నాది ఒకే కథ..
దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన నీది నాది ఒకే కథ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా సగటు ప్రేక్షకుల మెప్పుకూడా పొందుతున్నది. మెంటల్ మదిలో ఫేమ్ శ్రీవిష్ణు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను సొంతం చేసుకొన్నట్టు సమాచారం.
నిర్మాత కలైపులి థాను
సినిమా విడుదల నాటికే ఈ చిత్రాన్ని చూసిన కలైపులి థాను చిత్ర యూనిట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. తుది నిర్ణయం కోసం శనివారం సాయంత్రం నీది నాది ఒకే కథను కలైపులి థాను చూసినట్టు తెలిసింది.
Recommended Video
ధనుష్ హీరోగా
నీది నాది ఒకే కథ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. శ్రీ విష్ణు పోషించిన హీరో క్యారెక్టర్ను తమిళంలో ధనుష్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
మార్చి 23న రిలీజ్
మార్చి 23న రిలీజ్ అయిన నీది నాది ఒకే కథకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఆదివారం నుంచి 140 థియేటర్లకు పెంచినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
థ్యాంక్యూ మీట్
నీది నాది ఒకే కథ సినిమా థ్యాంక్యూ మీట్ ఆదివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. చిత్ర యూనిట్తోపాటు హీరోల శ్రీవిష్ణు, నారా రోహిత్, దర్శకుడు వేణు ఊడుగుల, కత్తి మహేష్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.