Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
భారీ ధర పలికిన ‘విరాట పర్వం’ డిజిటల్ రైట్స్: ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందంటే?
టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'విరాట పర్వం'. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల రూపొందిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక, ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి.
తాజా సమాచారం ప్రకారం.. 'విరాట పర్వం' ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇందుకోసం ఏకంగా రూ. 11 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. వాస్తవానికి డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా పోటీ పడినట్లు సమాచారం. అయినప్పటికీ నెట్ఫ్లిక్స్ అత్యధిక ధర చెల్లించడానికి ముందుకు రావడంతో దర్శక నిర్మాతలు ఆ సంస్థతో డీల్ చేసుకున్నారని తెలుస్తోంది. సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 45 రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
రానా కెరీర్లోనే కొత్తగా రూపొందిన 'విరాట పర్వం'ను ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న గెటప్లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది.