Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అక్కినేని మల్టీస్టారర్ వెనకున్న అసలు మ్యాటర్ ఇదన్నమాట!
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అక్కినేని ఫ్యామిలీకి చెందిన సెలబ్రెటీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకవైపు నాగార్జున బిగ్ బాస్ షోతో ప్రతి వారం హైప్ క్రియేట్ చేస్తుండగా మరోవైపు సమంత కూడా సామ్ జామ్ అంటూ ఓటీటీ వరల్డ్ లో మరింత వైరల్ అవుతోంది. ఇక లవ్ స్టొరీ సినిమాకు సంబంధించిన న్యూస్ లతో నాగ చైతన్య పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దసరా సందర్భంగా అఖిల్ బిగ్ బాస్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ లో అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రం గ్యాప్ లేకుండా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల నాగార్జున ఒక సినిమా కోసం మనం దర్శకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అఖిల్, నాగార్జున ఒక మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేవలం అది మల్టీస్టారర్ కాదట. ఫ్యామిలీ మొత్తం మళ్ళీ సినిమాలో కనిపించాలని ప్లాన్ వేసినట్లు సమాచారం.
మనం సినిమాతో అక్కినేనికి మరచిపోలేని హిట్టిచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం నాగ చైతన్యతో థాంక్యూ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నాగార్జున విక్రమ్ కు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఫ్యామిలీ కోసం ఒక మంచి కథను రెడీ చేయాలని కోరాడట. సొంత ప్రొడక్షన్ లోనే పెద్దగా బడ్జెట్ అవసరం లేకుండా సింపుల్ ఫ్యామిలీ స్టోరీ అయితే చాలని చెప్పాడట. అందుకు విక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కథ సెట్ చేయడానికి సమయం ఎంతైనా పట్టవచ్చని దర్శకుడు ముందే క్లారిటీ ఇచ్చినట్లు టాక్.