Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరో నిఖిల్కు వరుస చేదు అనుభవాలు? ఆ మూవీ రద్దయిందా?
తెలుగు యంగ్ హీరో నిఖిల్కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఆయన తాజా చిత్రం 'అర్జున్ సురవరం' ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...నిఖిల్ కమిటైన మరో మూవీ రద్దయ్యే పరిస్థితిలో ఉందట.
నిఖిల్ హీరోగా కొన్ని నెలల క్రితం 'శ్వాస' అనే చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఈ సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
నిఖిల్, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా శ్రీ తేజ్ ఫిలిం ఫ్యాక్టరీ, రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ పతాకాలపై కిషన్ కట్టా అనే యంగ్ డైరెక్టర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తేజు ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి నిర్మాతలుగా గతేడాది అక్టోబర్లో 'శ్వాస' ప్రారంభోత్సవం జరుపుకుంది.
అప్పట్లో ఈ ప్రారంభోత్సవానికి శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరైన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. జెమిని కిరణ్, నరేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. క్రిష్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు... అయితే ఏమైందో తెలియదు కానీ ఇపుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితిలో ఉందట.
'అర్జున్ సురవరం' మూవీ విషయానికొస్తే... షూటింగ్ పూర్తయిన ఈచిత్రం మే 1న విడుదల చేయాల్సి ఉండగా అవెంజర్స్ ప్రభావం ఉంటుందని వాయిదా వేశారు. 'మహర్షి' చిత్రం విడుదలైన వారం తర్వాత మే 17న అర్జున్ సురవరం చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆప్పుడు కూడా రిలీజ్ కాలేదు.
'అర్జున్ సురవరం' తమిళంలో హిట్ అయిన కనితన్ చిత్రానికి రీమేక్. టి.ఎన్ సంతోష్ దర్శకుడు. ఇదే దర్శకుడితో తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రల్లో రీమేక్ అయింది.