Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Maestro స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్: ఆరోజు నుంచే రాబోతున్న నితిన్ కొత్త సినిమా
'జయం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు యూత్ స్టార్ నితిన్. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ను అందుకున్న అతడు.. నటుడిగానూ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత కూడా పలు విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. అప్పుడప్పుడే స్టార్ స్టేటస్ను అందుకుంటోన్న సమయంలో వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బంది పడ్డాడు. ఇలా తన కెరీర్ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడీ టాలెంటెడ్ హీరో.
హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ.. రెచ్చిపోయి చూపించిన హీరోయిన్
గత ఏడాది నితిన్ 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఈ సంవత్సరం అతడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో 'చెక్' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడిపోయింది. దీంతో అతడికి ఆదిలోనే బిగ్ షాక్ తగిలినట్లైంది. ఇక, దీని తర్వాత నితిన్.. వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'రంగ దే' చిత్రం విడుదలైంది. ఇది కూడా భారీ అంచనాల నడుమ విడుదలైంది. టాక్ బాగానే ఉన్నా కలెక్షన్లను రాబట్టలేక పరాజయం పాలైంది. దీంతో అతడికి వరుస షాక్లు తగిలినట్లైంది.
ఈ ఏడాది వరుస ఫ్లాపుల తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన మూడో చిత్రం 'మాస్ట్రో'. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అంధాధున్'కు రీమేక్గా వస్తున్న దీనిని మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణను పూర్తి చేసుకుని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను కూడా కంప్లీట్ చేసేశారు. ఈ క్రమంలోనే దీన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో నేరుగా రిలీజ్ చేసేందుకు గానూ చిత్ర యూనిట్ డీల్ చేసుకున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
నితిన్ నటించిన 'మాస్ట్రో' మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు చాలా రోజులుగా ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, దీనికోసం సదరు సంస్థ ఏకంగా రూ. 32 కోట్లు వెచ్చించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆగస్టు 15న స్ట్రీమింగ్ చేయబోతున్నారనే టాక్ వినిపించింది. కానీ, అది కుదరలేదు. తాజా సమాచారం ప్రకారం.. 'మాస్ట్రో' సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఫిలిం నగర్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
సుడిగాలి సుధీర్పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!
క్రైమ్ థ్రిల్లర్గా రాబోతున్న 'మాస్ట్రో' చిత్రంలో యూత్ స్టార్వ నితిన్ కళ్లు కనిపించని యువకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.