Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' కి సెన్సార్ సమస్య?
హైదరాబాద్: నితిన్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'కొరియర్ బాయ్ కళ్యాణ్'. యామి గౌతమ్ హీరోయిన్. ప్రేమ్ సాయి దర్శకుడు. గురు ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థ తెరకెక్కించింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11 న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారు. అయితే సెన్సార్ స్లాట్ అనుకున్నట్లుగా దొరకలేదని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
వరసలో ఏడు చిన్న సినిమాలు సెన్సార్ కు ఎదురుచూస్తూండటంతో సెన్సార్ స్లాట్ దొరకలేదని తెలుస్తోంది. దాంతో మేరక్స్ మిగతా ఆ చిన్న సినిమా నిర్మాతల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ కోసం తిరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. వీరంతా ఒప్పుకుంటే సెన్సార్ అయ్యి...ప్రకటించిన తేదీకి విడుదల అవుతుంది.
దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్ బోయ్ కథ ఇది. ఓ కొరియర్ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్, థ్రిల్ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్, అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రముఖ నిర్మాత గౌతమ్ మీననన్ ఈ 'కొరియర్ బోయ్ కల్యాణ్'కు నిర్మాతగా మారారు. ఈ నెల 19న చిత్ర పాటలు విడుదలవుతున్నాయి. త్వరలో చిత్రం విడుదల తేదీని ఖరారు చేస్తామని నటుడు నితిన్ ప్రకటించారు. ఈ చిత్రంలో యామి గౌతమ్ హీరోయిన్ గా గా నటిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 11 న చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని సమాచారం.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ....''ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కారణాలున్నాయి. తెలుగులో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తమిళంలో జీవా కాల్షీట్లు కావల్సినన్ని దొరకలేదు. రెండు భాషల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనుకొన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు'' అని చెప్పుకొచ్చారు.
అలాగే ...గౌతమ్ మేనన్ చెబుతూ ''తెలుగులో నేను నిర్మించిన తొలి చిత్రమిది. కథ నచ్చే ప్రేమ్సాయికి అవకాశం ఇచ్చాను. అందరూ తమ వంతు సహకారం అందించారు''అన్నారు.
నితిన్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం గౌతమ్ మేనన్, ప్రేమ్సాయి చాలా కష్టపడ్డారు. నా దృష్టిలో ఈ సినిమాకి వాళ్లే హీరోలు. సన్నివేశాలు సహజంగా ఉంటాయి. భారతీయ వెండి తెరపై ఇలాంటి కథాంశంతో ఎవ్వరూ సినిమా తీయలేదు. కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది''అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్ బోయ్ కథ ఇది. ఓ కొరియర్ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్, థ్రిల్ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్, అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.
అశుతోష్ రాణా, నాజర్, సత్యం రాజేష్, సప్తగిరి, రవి ప్రకాష్, యింటూరి వాసు తదితరులు నటించారు.