twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీలోకి రాబోతున్న నితిన్ కొత్త సినిమా: భారీ ఆఫర్‌కు పడిపోయిన యూత్ స్టార్

    |

    ఈ ఏడాది ఇప్పటికే 'చెక్', 'రంగ్ దే' అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ రెండూ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్ మూవీ 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

    నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో' మూవీని జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది కాస్తా వాయిదా పడలేదు. ఇక, రెండు రోజుల క్రితమే ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. దీనికి కారణం ఓ బడా ఓటీటీ సంస్థ ఈ చిత్రానికి గానూ భారీ మొత్తం ఆఫర్ చేయడమేనని తెలుస్తోంది. నితిన్ సొంత సినిమా కావడంతో ఆ సంస్థ డీల్‌కు అతడు వెంటనే ఓకే చెప్పేశాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది. 'మాస్ట్రో' ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

     Nithiins Maestro Movie will be Release in OTT

    ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మాస్ట్రో'లో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఉండే ఈ మూవీ కొంత అడల్ట్ బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కింది. ఇందులో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు.

    English summary
    Tollywood Youth Star Nithiin Now Doing Maestro Movie Under Merlapaka Gandhi Direction. This Movie will be Release in OTT.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X