Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సమంతతో రొమాన్స్ చేయబోతున్న నితిన్!
హైదరాబాద్ : 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో యంగ్ హీరో నితిన్ దశ తిరిగింది. ఇప్పుడు వరుస అవకాశాలు నితిన్ను ముంచెత్తుతున్నాయి. ఆ రెండు చిత్రాల హిట్ అయ్యాక పలు ఆఫర్లు దక్కించుకున్న నితిన్కు తాజాగా మరో చాన్స్ దక్కిందట.
గతంలో 'ఆటాడిస్తా' చిత్రాన్ని తెరకెక్కించిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాకు కమిటైనట్లు తెలుస్తోంది. ఇందులో సమంత హీరోయిన్గా అనుకుంటున్నట్లు సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారట. అయితే ఈ విషయాలన్నీ అనధికారిక సమాచారమే. అఫీషియల్గా ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నటిస్తున్నారు. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ సాయి ఈ సినిమాకు దర్శకుడు. గౌతం మీనన్ నిర్మాత. నితిన్ సరసన యామి గౌతం నటిస్తుంది. కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. తమిళ, తెలుగు సినిమాలలో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాకు కమియ్యాడు నితిన్. ప్రస్తుతం ఈచిత్రానికి 'హాట్ ఎటాక్' అనే టైటల్ పరిశీలనలో ఉంది. గతంలో వైష్ణో అకాడమీ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తను ప్రారంభించిన కొత్త బ్యానర్ పూరీ జగన్నాథ్ టాకీస్ పై స్వీయ దర్శకత్వంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటిసారి వీరి కలయికలో తెరకెక్కే ఈ చిత్రం మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.