Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
చార్మి వల్లే? నితిన్-పూరి మూవీ రద్దయిందా?
హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రం నితిన్ తో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల నితిన్ ప్లేసులోకి వరుణ్ తేజ్ వచ్చాడు.
కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని నితిన్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కాస్త ఘాటుగానే పూరి స్పందించారని ఆయన తాజా ట్వీట్ చూస్తే అర్దమవుతుంది.
పూరీ ట్వీట్ చేస్తూ..." నేను నితిన్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టుని వేరే హీరోతో చేస్తున్నాను. అదే రోజున షూటింగ్ ప్రారంభమవుతుంది..మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను " అన్నారు. అదే రోజున వేరే హీరోతో ఇదే కథతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తానని పూరి వెంటనే అనటం అంతటా చర్చనీయాంశంగా మారింది.
కాగా...ఈ ప్రాజెక్టు రద్దవడానికి కారణం కొన్ని విషయాల్లో పూరి, నితిన్ మధ్య విబేధాలు రావడమే అని అంటున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ నిర్మించాలనుకున్నారు. కానీ నితిన్ తన బేనర్లోనే సినిమా తీయాలని పట్టుదలతో ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని అంటున్నారు.
ఇది ఓ కారణం అయితే.... చార్మిని తన సినిమాకు సహ నిర్మాతగా పెట్టాలని చూడటం కూడా నితిన్ కు నచ్చలేదని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చిలికి చిలికి సినిమా రద్దయ్యే వరకు వెళ్లిందని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.