Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిత్యా మీనన్ లవ్ ఎఫైర్ విత్...
చిత్రం విషయానికి వస్తే... నిత్యామీనన్, క్రిష్ సత్తార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మాలిని 22'. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ థియేటర్స్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రాజ్కుమార్ సేతుపతి ఈ సినిమాను నిర్మించారు. అరవింద్, శంకర్ సంగీతాన్ని సమకూర్చారు. రివేంజ్ డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలుగులో పాటు తమిళంలోనూ ఈచిత్రాన్ని విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేయనున్నారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ "శ్రీప్రియగారు కథ చెప్పినప్పుడు చేయడం కష్టమనిపించినా ఒప్పుకున్నాను. పాటలు బాగా కుదిరాయి. ఈ సినిమాలో నటించిన మేల్ ఆర్టిస్టులకు స్పెషల్ థాంక్స్'' అని చెప్పారు. 22 కొట్టాయం కథను తెలుగు, తమిళ భాషలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి నిర్మించిన ఈ సినిమాలో ఓ గొప్ప సందేశం ఉంటుందని దర్శకురాలు శ్రీప్రియ సినిమాపై ఉన్న అభిరుచితో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కథానాయిక నిత్యామీనన్ తెలిపారు. సున్నితమైన అంశంతో తెరకెక్కిన సినిమా అని క్రిష్ తెలిపారు.
కోవైసరళ, కోట శ్రీనివాసరావు, విద్యురామన్, సూదుకవ్వమ్, అంజలిరావ్, హార్లిక్స్ అంకుల్, మురళి, చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రేమ్శ్రీనివాస్, మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతంకశ్యప్, పాటలు: అనంత్శ్రీరామ్, సంగీతం: అరవింద్-శంకర్, ఎడిటింగ్: భవన్ శ్రీకుమార్, కెమెరా: మనోజ్పిళ్లై, నిర్మాత: రాజ్కుమార్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ