Don't Miss!
- News రాందేవ్బాబాకు సుప్రీం షాక్.. నేరుగా హాజరుకావాలని నోటీసులు!
- Finance Patanjali: బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్.. షేర్ల పతనం..!
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
SVSC-మహేష్-వెంకీ అభిమానులకు షాకింగ్ న్యూస్
హైదరాబాద్: మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతుందని, తమ అభిమాన హీరోలను కనులారా చూసి ఆనందిద్దామని ఫ్యాన్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో..... ఎలాంటి గ్రాండ్ ఫంక్షన్ లేకుండానే సింపుల్గా ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 16వ తేదీన ఆడియోను ఎలాంటి ఫంక్షన్ నిర్వహించకుండా హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో చిత్ర యూనిట్ సభ్యులతో చిన్న పాటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సింపుల్ గా ఆడియో రిలీజ్ కానిచ్చేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.