Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇక్కడ ఇలా జరుగుతుంటే... విదేశాలకు జంప్ అవుతున్న బండ్ల గణేష్!
Recommended Video
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్ కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ తర్వాత నిర్మాత అవతారం ఎత్తారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.
2009లో రవితేజ హీరోగా వచ్చిన 'ఆంజనేయులు' మూవీ ద్వారా నిర్మాతగా మొదలైన గణేష్ ప్రస్థానం... 2015లో 'టెంపర్' మూవీతో క్లోజ్ అయింది. ఆ తర్వాత ఆయన కోర్టు వివాదాల కారణంగా సినిమా నిర్మాణానికి దూరం అయ్యారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి అంటీముట్టనట్లు ఉంటున్న గణేష్... మహేష్ మూవీ 'సరిలేరు నీకెవ్వురు' ద్వారా నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
బండ్ల గణేష్ కోసం అనిల్ రావిపూడి కామెడీ పాత్ర
కామెడీ రోల్స్ రాయడంలో ఎక్స్పర్ట్ అయిన అనిల్ రావిపూడి... బండ్ల గణేష్ కోసం ‘సరిలేరు నీకెవ్వరు' మూవీలో పాత్ర రాశారని, సినిమాలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్లో అతడి కోసం కొన్ని సీన్లు రాశాడని, ఈ రోల్ చేయడానికి గణేష్ కూడా ఒప్పకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అన్నపూర్ణ స్టూడియోలో ట్రైన్ సెట్
‘సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో ట్రైన్ లోపలి భాగం సెట్ చేశారు. జులై 26 నుంచి ఇక్కడ ఇందుకు సంబంధించిన సీన్ల చిత్రీకరణ జరుగనుంది. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు గణేష్ను కాంటాక్ట్ చేయలేదని తెలుస్తోంది.
విదేశాలకు జంప్ అవుతున్న బండ్ల గణేష్, ఇంతకీ సినిమాలో ఉన్నాడా.. లేడా?
ఓ వైపు ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి ట్రైన్ ఎపిసోడ్కు షూటింగుకు ఏర్పాట్లు జరుగుతుంటే... బండ్ల గణేష్ అదే సమయంలో విదేశాలకు వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంలో గణేష్ ఉన్నాడా? లేదా? అనేది అయోమయంగా మారింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సరిలేరు నీకెవ్వరు
‘సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ కొన్ని రోజులుగా కాశ్మీర్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఆర్మీ బేస్లో కీలక సన్నివేవాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. విజయశాంతి కీలకపాత్రలో కనిపించనుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు.