Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లీకైంది: పూరి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర, పేరు
హైదరాబాద్: ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం గోవాలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇన్సపెక్టర్ దయ గా కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా రగ్గడ్ గా ఉండబోతోందని, చాలా సార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్ర ఇదని చెప్తున్నారు. సర్కిల్ ఇన్సపెక్టర్ గా ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడని వినికిడి. నాగార్జున శివ మణి లో చేసిన పాత్ర తరహాలో పూర్తి మాస్ టచ్ లో ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకుండూంటంతో మంచి క్రేజ్ వస్తోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ యాక్షన్ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తాడని సమాచారం.
వక్కంతం వంశీ చెప్పిన కథ ఎన్టీఆర్కి బాగా నచ్చింది. అందుకే మరో ఆలోచన లేకుండా, 'రభస' తరవాత కాస్త కూడా విరామం తీసుకోకుండా - సెట్స్పైకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అలియాభట్ పేరు పరిశీలనకు వచ్చినా, చివరికి కాజల్ని ఖాయం చేసేశారు. ఈ చిత్రానికి 'కుమ్మేస్తా', 'టెంపర్', 'నేనో రకం','షంషేర్'., ... ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో 'టెంపర్'కే ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు. జనవరి 9న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ప్రస్తుతం గోవాలో ఓ పాటతో సహా పోరట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారుయ ఇటీవల ఉత్తరాంధ్రాలో సంబవించిన తుఫాన్ కారణంగా వైజాగ్ షెడ్యూల్ను సైతం గోవాలోనే షూట్ చేయనున్నారని వినిపిస్తుంది. ఇప్పటికే పలుకారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఆన్ సెట్స్లోనే పూరీ ఎస్. ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎడిటింగ్ పనులు కూడా చేయిస్తున్నారని యూనిట్ అంటోంది. ఈనెలలో సినిమా ఫస్ట్లుక్ ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయాలని యూనిట్ భావిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్ .