Don't Miss!
- Finance Bitcoin Crash: భారీగా పతనమైన బిట్కాయిన్.. ఇండియాకి బినాన్స్ తిరిగి ఎంట్రీ..
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ పుట్టిన రోజునే ఎనౌన్స్ మెంట్
హైదరాబాద్: సాధారణంగా హీరోలు తమ పుట్టిన రోజున కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేస్తూంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. ఆయు తన పుట్టిన రోజును మార్చి 20న జరుపుకోనున్నారు. ఆ రోజున పూరీ జగన్నాథ్ తో చేయబోయే చిత్రం గురించి ఎనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే రెండు స్టోరీ లైన్స్ ని ఎన్టీఆర్ కి చెపితే అందులో ఒకటి ఎంచుకున్నాడని సమాచారం. పూరీ ప్రస్తుతం బ్యాంకాక్ లో ఈ చిత్రానికి సంభందించిన స్క్రిప్టు వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు.
'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్ ఈ కాంబినేషన్ కుదర్చడానికి ప్రయత్నించాడు. కానీ... వీలు కాలేదు. ఈ సారి మాత్రం ఎన్టీఆర్ - పూరి జత కట్టడం ఖాయంగానే కనిస్తోంది. త్వరలోనే ఈ 'ఆంధ్రావాలా' కాంబినేషన్ సెట్స్పైకి వెళ్లొచ్చు. ఈ సారి ఖచ్చితంగా ఎన్టీఆర్ తో పెద్ద హిట్ ఇస్తాననే నమ్మకంతో పూరీ ఉన్నారు.
మరో ప్రక్క ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్ నిర్మాత. ఈ రోజు నుంచి(ఏప్రియల్ 7) నుంచి తిరిగి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దర్శకుడు ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా షూటింగ్ ఆగిపోయింది.
దర్శకుడు మాట్లాడుతూ...''ఎన్టీఆర్ శైలికి తగ్గ కథ ఇది. హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ... వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల పొల్లాచ్చిలో అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన పాట సినిమాకి ఆకర్షణగా నిలుస్తుంది. ఎన్టీఆర్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అన్నారు. సినిమాకి 'రభస' అనే పేరుని పరిశీలిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్ని కొత్తగా చూపించే చిత్రమిది. ఆయన సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి'' అన్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 'అత్తమడుగువాగులోనా.. అత్తకూతురో' అనే పాటను రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.