Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ మరో రీ-మిక్స్
ఎలక్షన్ల పర్వం ముగిసాకా వరుసగా సినిమాలు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని, గన్నవరం వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రం అనంతరం మున్నా ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలోదిల్ రాజు నిర్మించే "బృందావనం" లో నటించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర షూటింగ్ నవంబర్ 7న ప్రారంభం కానుంది.
హ్యాపీడేస్, కొత్తబంగారులోకం లాంటి సంచలన విజయాలతో జోష్ మీదున్న మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. "బృందావనం" చిత్రానికి "గోవిందుడు అందరివాడేలే" అనేది ఉపశీర్షిక. ఈ రెండూ సింక్ అయ్యేలా అలనాటి క్లాసికల్ మూవీ మిస్సమ్మ చిత్రంలోని "బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే" అనే పాటని రీ-మిక్స్ చెయ్యబోతున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో "ఓలమ్మి తిక్కరేగిందా" పాటకు మంచి స్పందన వచ్చింది, అలాగే ఇటీవల విడుదలైన రామ్ చరణ్ తేజా మగధీర చిత్రంలోని "బంగారు కోడి పెట్ట" పాట ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తోంది. మరి ఈ పాట ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఆడియో విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే. అన్నట్టు ఈ చిత్ర ఆడియోను 2010 ఫిబ్రవరి లోనూ, సినిమాను 24 మార్చి 2010 లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే తేదీన విడుదలైన ఆది చిత్రం ఏన్నో రికార్డులను సృష్టించింది. ఈ పాట ఆదరణపొందితే మరిన్ని రీ-మిక్స్ పాటలు వస్తాయనడం నిస్సందేహం.