Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రానికి అది ఊహించని ట్విస్టే
ఎన్టీఆర్, కాజల్, సమంత కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తోన్న బృందావనం చిత్రం ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర సమస్య ఎదుర్కొంటోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అనుకున్న దానికంటే దర్శకుడు మూడు రెట్లు ఎక్కవ తీసాడని, ఎక్కువ ఎక్సపోజర్ జరిగిందని,దాంతో ఏ సన్నివేశాలు ఉంచాలో, ఏ షాట్స్ ని నిర్ధాక్ష్యంణ్యంగా తొలిగించాలో అన్న దానితో తల పట్టుకు కూర్చున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు త్రివిక్రమ్ చిత్రాలు ఈ తరహా సమస్యని ఎదుర్కొనేవి. లెక్క లేకుండా కంటిన్యూగా నాలుగైదు గంటలకు సరపడ తీసేయటం, తర్వాత ఏది కట్ చేయాలి ఏది ఉంచాలి అన్న మీమాంస రావటం ఎడిటింగ్ లో మామూలైపోయింది. అయితే ఎన్టీఆర్ చిత్రాలకు ఇప్పటివరకూ ఆ సమస్య అదృష్టవశాత్తు ఎదురుకాలేదు. ఎప్పుడూ కొంచెం అటూ ఇటూలో ప్లానింగ్ ప్రకారం నడిచిపోయేది. అయితే ఈ సమస్య ఎదురైతే ఎక్కడెక్కడి లింక్ లూ ఎడిటింగ్ లో చెల్లాచెదరయ్యే సమస్య ఎదురౌతుందని సీనియర్ ఎడిటర్స్ అంటూంటారు. అటువంటి సమస్య రాకుండా బృందావనం బయిటపడాలని కోరుకుందాం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 1న రిలీజ్ కాబోతోంది.