twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రానికి అది ఊహించని ట్విస్టే

    By Srikanya
    |

    ఎన్టీఆర్, కాజల్, సమంత కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తోన్న బృందావనం చిత్రం ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర సమస్య ఎదుర్కొంటోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అనుకున్న దానికంటే దర్శకుడు మూడు రెట్లు ఎక్కవ తీసాడని, ఎక్కువ ఎక్సపోజర్ జరిగిందని,దాంతో ఏ సన్నివేశాలు ఉంచాలో, ఏ షాట్స్ ని నిర్ధాక్ష్యంణ్యంగా తొలిగించాలో అన్న దానితో తల పట్టుకు కూర్చున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు త్రివిక్రమ్ చిత్రాలు ఈ తరహా సమస్యని ఎదుర్కొనేవి. లెక్క లేకుండా కంటిన్యూగా నాలుగైదు గంటలకు సరపడ తీసేయటం, తర్వాత ఏది కట్ చేయాలి ఏది ఉంచాలి అన్న మీమాంస రావటం ఎడిటింగ్ లో మామూలైపోయింది. అయితే ఎన్టీఆర్ చిత్రాలకు ఇప్పటివరకూ ఆ సమస్య అదృష్టవశాత్తు ఎదురుకాలేదు. ఎప్పుడూ కొంచెం అటూ ఇటూలో ప్లానింగ్ ప్రకారం నడిచిపోయేది. అయితే ఈ సమస్య ఎదురైతే ఎక్కడెక్కడి లింక్ లూ ఎడిటింగ్ లో చెల్లాచెదరయ్యే సమస్య ఎదురౌతుందని సీనియర్ ఎడిటర్స్ అంటూంటారు. అటువంటి సమస్య రాకుండా బృందావనం బయిటపడాలని కోరుకుందాం. ఇక ఈ చిత్రం అక్టోబర్ 1న రిలీజ్ కాబోతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X