జూ ఎన్టీఆర్ అభిమానులకు హ్యాపీ న్యూస్
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం బృందావనం అక్టోబర్ ఒకటవ తేదిని రిలీజ్ డేట్ గా కన్ఫర్మ్ చేసారు. దిల్ రాజ్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది..కేవలం ఒక్క సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియోన్స్ ని టార్గెట్ చేసి తీసారని సమాచారం. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూంటే చోటా కె.నాయుడు కెమారా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











