Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ఊసరవెల్లి' నిర్మాత ని టెన్షన్ లో పడేసిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ తాజా చిత్రం 'ఊసరవెల్లి' ని చిత్ర నిర్మాత ప్రసాద్ రిలీజ్ ఈ నెల 13న చేద్దామని నిర్ణయించుకున్నారట. అదే యూనిట్ లో కూడా అంతా ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే సెప్టెంబర్ 23న రిలీజైన మహేష్ 'దూకుడు' రికార్డ్ కలెక్షన్లు లతో దూసుకుపోతోంది. విడుదలైన ప్రతీ ధియోటర్ లోనూ తీసేయాల్సిన పరిస్ధితి లేకుండా నిలబడి ధియేటర్లలో ఆడుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో 'ఊసరవెల్లి'కి ఎక్కువ థియేటర్లు దొరుకుతాయా అనే సందేహం ఏర్పడింది. అందులోనూ 'ఊసరవెల్లి'కి మంచి కలెక్షన్లు రావాలన్నా ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తేనే మంచిదనే అంతా అంటున్నారు. వాళ్లు చెప్పేదాని ప్రకారం 'ఊసరవెల్లి' అక్టోబర్ 13న విడుదలైతే ఇటు దానికీ, అటు 'దూకుడు'కీ ప్రయోజనం ఉంటుందని వాళ్లు సూచిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని ప్రెస్జేజి ఇష్యూగా తీసుకున్నారని తెలుస్తోంది. 'దూకుడు' రికార్డులకి బ్రేక్ వేసి, తాను టాలీవుడ్ నెంబర్వన్ రేసులో తానూ ముందున్నట్లు చెప్పాలనేది అతని అభిమతంగా ఫిలింనగర్ జనం చెప్పుకుంటున్నారు.
అందులోనూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'అశోక్' వర్కవుట్ కాలేదు. దాంతో ఈ చిత్రంతో ఎలాగైనా సూపర్హిట్ కొట్టాలనే తపనతో ఆ ఇద్దరూ 'ఊసరవెల్లి' కోసం కృషిచేశారు. తప్పుకుండా ఈ సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఎన్టీఆర్ ఉన్నారు. అందుకే ఆరునూరైనా అక్టోబర్ 6నే సినిమా విడుదల చేయాలని అతను పట్టుపట్టడంతో నిర్మాత ప్రసాద్ మరో దారిలేక విడుదలకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పుడు విశ్లేషకులంతా 'ఊసరవెల్లి' రిలీజ్ ఏ మేరకు 'దూకుడు' రికార్డుల్ని ప్రభావితం చేయనున్నది అనే విషయం మీదే ఉంది. ఊసరవిల్లే ఎఫెక్టు గ్యారెంటీగా థియేటర్ల సంఖ్య మీదా, కలెక్షన్ల మీదా కనిపించనున్నదని అంటున్నారు.