Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్-మహానాయకుడు: ఆ లాస్ కొంత పూడ్చి.. దీనికి కొత్త రేటు? షాకైన బయ్యర్లు..
Recommended Video
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కగా... మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రాకి విమర్శకుల ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ వచ్చిన్పటికీ బాక్సాఫీసు వద్ద కమర్షియల్గా వర్కౌట్ కాలేదు.
తొలి భాగం కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో 'ఎన్టీఆర్-మహానాయకుడు'లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకే రిలీజ్ డేట్ కూడా ఆలస్యం అవుతోంది. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయంతో బయ్యర్లు షాకయ్యారనే వార్తలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి.
సెకండ్ పార్ట్ బిజినెస్లో కవర్ చేస్తామన్నారా?
సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు దాదాపు 50% మేర నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే సినిమా అమ్మేటప్పుడే నిర్మాతలు.. ఒక వేళ ఆశించిన స్థాయిలో ఆడకపోతే సెకండ్ పార్ట్ ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజినెస్లో కవర్ చేస్తామని బయ్యర్లకు మాట ఇచ్చారట.
తెరపైకి కొత్త ప్రతిపాదన, 25% పరిహారం?
మొదటి భాగం వల్ల ఏర్పడ్డ నస్టాలను రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజినెస్లో సెటిల్ చేయడం కాకుండా... నష్టపోయిన వారికి 25% పరిహారం ఇవ్వాలని కొత్త ప్రతి పాదన తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రానికి కొత్త రేట్లుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నిర్ణయం వెనక ఎవరు ఉన్నారు?
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్.బి.కె ఫిల్మ్స్ పతాకంపై బాలయ్య నిర్మిస్తున్నారు. మరికొందరు కూడా సహ నిర్మాతలుగా ఉన్నారు. అయితే ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజినెస్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఫిబ్రవరి 22న రిలీజ్
‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన ఘట్టం నుంచి... 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘట్టం వరకు జరిగిన కీలకమైన అంశాలను చూపించబోతున్నారు.