Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ చిత్రంలో ఎన్టీఆర్, ప్రభాస్?
ఇక రాఘవేంద్రరావు పరుశరాముడులో కీలక పాత్ర అయిన రాముడుకి ఎన్టీఆర్ ని అడిగినట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ కూడా ఈ ప్రపోజల్ కి సముఖంగానే ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ముందు అదుర్స్ పూర్తి చేయాల్సి ఉంది. దానికే రెస్ట్ అనంతరం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనలని డాక్టర్స్ చెప్తున్నారు. దాంతో ఇది పూర్తయ్యాకే ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పై ఆలోచిస్తారు. ఇక పరుశరాముడుగా ప్రభాస్ ఈ చిత్రంలో కరుణ, రౌధ్ర రసాలను పంచనున్నాడని చెప్తున్నారు.
భారవి రెడీ చేస్తున్న ఈ స్క్రిప్టులో ఈ ఇద్దరు స్టార్ హీరోలు చెయ్యటం మంచి క్రేజ్ తెచ్చే విషయమే. అయితే కొంత మంది ఎన్టీఆర్ శ్రేయాభిలాషులు మాత్రం ఎన్టీఆర్ ని అప్పుడే పౌరాణిక వేషాలు జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది. ఇక గతంలో యమదొంగలో ప్రభాస్ విశ్వామిత్రుడుగా గెస్ట్ గా కనిపించాడు. ఇక ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ కి వచ్చింది. అందులోనూ ఇద్దరూ మంచి ప్రెండ్స్ అవటం కూడా ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. పరుశరాముడు క్షత్రియజాతిని సంహరించిన విష్ణుముర్తి అవతారం అని పౌరాణికాలు చెప్తున్నాయి. మరి ఆ తరహా కథకు ఆ కాలంలోకి వెళ్ళి అప్పటి సెట్స్ వేసి రాఘవేంద్రరావు ఎలా తీస్తారన్నిది ఆసక్తికరమే.