Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్, పూరి ప్రాజెక్టు రద్దు కాలేదా?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందని, బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని గతంలో వార్తలు వచ్చినా.... ఆ తర్వాత ఈచిత్రం రద్దయిందనే టాక్ వినిపించింది. చాలా కాలంగా ఈచిత్రానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేక పోవడంతో అంతా ఈ సినిమా ఇక ఉండదనే అనుకున్నారు.
అయితే తాజాగా అందిన సమాచారం ఏమంటే.... ఈ చిత్రం రద్దుకాలేదని, త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. జూ ఎన్టీఆర్తో దమ్ము చిత్రాన్ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్ బేనర్ వారు ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
గతంలో జూ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా' చిత్రం తీసిన పూరి... ఎన్టీఆర్ కెరీర్లోనే పరమ ప్లాపు చిత్రాన్ని జమ చేశాడు. అయితే ఈ సారి అలా జరుగకుండా పకడ్బందీ స్టోరీలైన్, మంచి స్ర్కిప్టుతో రెడీ అయ్యాడు. ఇప్పటికే జూ ఎన్టీఆర్కు స్టోరీ, స్క్రిప్టు వివరించాడని, అతను కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ఈచిత్రాన్ని తొలుత బండ్ల గణేష్ నిర్మించాలనుకున్నప్పటికీ.... ఇప్పటికే అతనికి 'బాద్ షా' చిత్రం అవకాశం ఇచ్చాడు కాబట్టి, దమ్ము చిత్రం అనుకున్న రేంజిలో ఆడక పోవడంతో పెద్దగా ఏమీ వెనకేసుకోలేక పోయిన నిర్మాతలు కెఎస్ రామారావు, వల్లభలకు మరో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట జూనియర్.