Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్, పూరి ప్రాజెక్టు రద్దు కాలేదా?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందని, బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని గతంలో వార్తలు వచ్చినా.... ఆ తర్వాత ఈచిత్రం రద్దయిందనే టాక్ వినిపించింది. చాలా కాలంగా ఈచిత్రానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేక పోవడంతో అంతా ఈ సినిమా ఇక ఉండదనే అనుకున్నారు.
అయితే తాజాగా అందిన సమాచారం ఏమంటే.... ఈ చిత్రం రద్దుకాలేదని, త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. జూ ఎన్టీఆర్తో దమ్ము చిత్రాన్ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్ బేనర్ వారు ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
గతంలో జూ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా' చిత్రం తీసిన పూరి... ఎన్టీఆర్ కెరీర్లోనే పరమ ప్లాపు చిత్రాన్ని జమ చేశాడు. అయితే ఈ సారి అలా జరుగకుండా పకడ్బందీ స్టోరీలైన్, మంచి స్ర్కిప్టుతో రెడీ అయ్యాడు. ఇప్పటికే జూ ఎన్టీఆర్కు స్టోరీ, స్క్రిప్టు వివరించాడని, అతను కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ఈచిత్రాన్ని తొలుత బండ్ల గణేష్ నిర్మించాలనుకున్నప్పటికీ.... ఇప్పటికే అతనికి 'బాద్ షా' చిత్రం అవకాశం ఇచ్చాడు కాబట్టి, దమ్ము చిత్రం అనుకున్న రేంజిలో ఆడక పోవడంతో పెద్దగా ఏమీ వెనకేసుకోలేక పోయిన నిర్మాతలు కెఎస్ రామారావు, వల్లభలకు మరో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట జూనియర్.