Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దటీజ్ పూరి జగన్నాథ్ ...మళ్లీ ప్రూవ్ చేస్తున్నాడు
హైదరాబాద్ : పూరి జగన్నాథ్ అంటే స్పీడు కు మారు పేరు. ఆయన స్క్రిప్టుని స్పీడుగా రాయటమే కాదు..అంతకన్నా వేగంగా తెరకు ఎక్కించగలరని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు. అందుకే హీరోలంతా ఆయన డైరక్షన్ లో చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. హిట్టో,ఫట్టో నాలుగైదు నెలల్లో తేల్చేయటం ఆయన స్పెషాలటి. అలాగని ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవటమనేది జరగదు. తెరపై ఏ ఫ్రేమ్ ఎలా వస్తుందో, ఏ షాటో అవసరమో పూర్తి క్లారిటీతో ఉండటమే ఆయన స్పీడు సీక్రెట్ అని చెప్తూంటారు. తాజాగా చేస్తున్న ఎన్టీఆర్ సినిమాతో అది మరోసారి పూరి ప్రూవ్ చేస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్టాఫ్ అప్పుడే పూర్తైందని సమాచారం. అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా పూర్తి ఏర్పాట్లు చేసాడని, పూరి స్పెషల్ గా ఎన్టీఆర్ ని స్టైలిష్ గా డిజైన్ చేసాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ తోనే బిజినెస్ క్రేజ్ తెచ్చి పూర్తి చేద్దామనే ధీమాలో దర్శక,నిర్మాతలు ఉన్నారు. ఈ వారం చివరలో ఫస్ట్ లుక్ రిలీజ్ ఉండబోతోందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా భావించి ఈ చిత్రాన్ని పూరి తీర్చి దిద్దుతున్నారు.
షూటింగ్ ను అత్యంత వేగంగా పూర్తి చేయగల దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమా అంటే యూనిట్ మొత్తం చాలా స్పీడుగా ఉండాలి. ప్రస్తుతం ఎన్టీఆర్-పూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఓ చిత్రం మరింత వేగంగా చిత్రీకరణ జరుగుతోందని యూనిట్ అంటోంది. ప్రస్తుతం యూనిట్ అంతా గోవా షూటింగ్ లో తలమునకలై ఉంది. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో ఓ పాటతో సహా పోరట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇటీవల ఉత్తరాంధ్రాలో సంబవించిన తుఫాన్ కారణంగా వైజాగ్ షెడ్యూల్ను సైతం గోవాలోనే షూట్ చేయనున్నారని వినిపిస్తుంది. ఇప్పటికే పలుకారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఆన్ సెట్స్లోనే పూరీ ఎస్. ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎడిటింగ్ పనులు కూడా చేయిస్తున్నారని యూనిట్ అంటోంది.
ఈ సినిమాకు టైటిల్స్గా 'రుబాబు' 'టెంపర్', 'నేనొరకం', అంటూ ప్రచారం సాగుతోంది. తాజగా 'షంషేర్' అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తుంది. పరమేశ్వర ఆర్స్ట్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.