Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
జూ ఎన్టీఆర్-పూరీ జగన్ న్యూ మూవీ టైటిల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'కుమ్మేస్తా', 'కుమ్ముతా' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్తో కూడిన సినిమా కావడంతో 'కుమ్మేస్తా' టైటిల్ ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడు. వాస్తవానికి....మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు బండ్ల గణేష్. అయితే ఇతర ప్రాజెక్టుల ఇచ్చిన కమిట్మెంట్స్ వల్ల పూరి జగన్నాథ్తో చేయాల్సిన సినిమాను హోల్డ్లో పెట్టాడు మహేష్ బాబు. ఆయనతో సినిమా చేయడానికి చాలా సమయం ఉండటంతో ఈ లోగా జూ ఎన్టీఆర్తో ఓ సినిమా ప్లాన్ చేసాడు పూరి. ఈ సినిమాను నిర్మించే అవకాశం కూడా బండ్ల గణేష్కే ఇచ్చాడు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టోటల్ షూటింగ్ మే నెలలో పూర్తవుతుందని అంటున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ తన సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
పక్కా ప్లానింగుతో సినిమా తీసే పూరి జగన్నాథ్ ఈ సంవత్సరాంతంలోగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా'చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.