Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అన్నయ్య కోసం ఎన్టీఆర్ ప్రయత్నాలు.. బ్లాక్ బస్టర్ నిర్మాతలతో ఒప్పందం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య ఎమోషనల్ గా చాలా బలమైన బంధం నెలకొని ఉంది. హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య మరింతగా బంధం పెరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ జై లవకుశ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో అందరిని మెప్పించాడు. ఇప్పుడు అన్నయ్య కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే ఎన్టీఆర్ ప్రమేయంతో కళ్యాణ్ రామ్ చిత్రం ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వరుసగా నిరాశపరుస్తూ
మంచి కథ పడితే కళ్యాణ్ రామ్ కు మాస్ ఆడియన్స్ ని మెప్పించగల సత్తా ఉంది. ఆ మధ్యన కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పోలీస్ అధికారిగా పటాస్ చిత్రంలో నటించాడు. పటాస్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కళ్యాణ్ రామ్ కు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్నయ్య కోసం
తాజాగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగుతున్నాడట. కథల ఎంపిక విషయంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ జడ్జిమెంట్ బావుంటుంది. అందుకే వారు వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి చిత్రాలతో ఘానా విజయాలు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ మైత్రి మూవీస్ సంస్థతో మాట్లాడి తన సోదరితో సినిమా చేయాలనీ కోరాడట. వాళ్ళు కూడా సుముఖంగానే స్పందించినట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్కు సరిపోయే
కళ్యాణ్ రామ్కు సరిపోయే కథ కోసం మైత్రి మూవీస్ నిర్మాతలు వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ భారీ చిత్రాలతో పాటు మీడియం రేంజ్ ఉన్న చిత్రాలని కూడా నిర్మిస్తోంది. ఒకేసారి రెండు మూడు చిత్రాలని నిర్మించేస్తున్నారు. కథ దిరికితే కళ్యాణ్ రామ్ చిత్రం కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త దర్శకుడితో
కొత్త దర్శకుడితో మీడియం బడ్జెట్ లో కళ్యాణ్ రామ్ చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, మైత్రి మూవీస్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కు కూడా ఈ సంస్థ నుంచి మంచి విజయం దక్కుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.