Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'అలా మొదలైంది' నిర్మాతకి జూ.ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చాడా?
నాని, నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టయిన చిత్రం అలా మొదలైంది. ఈ చిత్రం యాభై రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత దామోదర్ రెడ్డి మాట్లాడుతూ....నిజానికి తమ చిత్రం ఆశించిన రీతిలో విజయవంతం కాలేదని, దానికి కారణం అనుకున్న ధియోటర్స్ దొరక్కపోవటమేనని అన్నాడు. అలాగే రెండు వారాలు పాటు మల్టి ప్లెక్స్ లో షోలు సరిపడినవన్నీ పడలేదని అదికూడా దెబ్బ కొట్టిందని చెప్పాడు. అంతేగాక తాను చిత్రాన్ని సుదర్శన్ 35 ఎం ఎంలో విడుదల చేద్దామనుకున్నానని, అయితే అందులో ఓ స్టార్ హీరో చిత్రం నడుస్తూండటంతో తనకు ఆ ధియోటర్ ఇవ్వలేదని, అప్పటికే ఆ చిత్రం నలభై రోజుల పాటు డెఫిషిట్ లో నడుస్తున్నా దాన్ని తీయటానికి ఎగ్జిబిటర్ ఒప్పుకోలేదని వాపోయాడు.
ఇంతకీ ఆ ధియోటర్ లో అప్పటికి ఆడుతున్న చిత్రం ఎన్టీఆర్ నటించిన బృందావనం. దిల్ రాజు నిర్మించిన ఆ చిత్రం కలెక్షన్స్ ఆశించిన స్ధాయిలో లేకపోయినా మొదట ఎగ్జిబిటర్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం చిత్రాన్ని నడిపారు. ఈ విషయమే దామోదర్ రెడ్డి ఎత్తారు. దాంతో ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ ...ఆ నిర్మాతకు ఫోన్ చేయించాడని, ఇలా మాట్లాడినందుకు సీరియస్ అయ్యాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.అంతేగాక ఎన్టీఆర్ సర్కిల్ లోని కొందరు వార్నింగ్ తరహాలో మాట్లాడారని, ఆ నిర్మాత తన వారి దగ్గర వాపోయారని చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎన్టీఆర్ చేయలేదని ఆయనకు చెందిన వారు తొందరపడి చేసారని మరో మాట వినపడుతోంది. అదీ సంగతి..