Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాని సినిమా విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్.. ఇక ఓటీటీలోనే రిలీజ్ చెయ్యాలా?
కరోనా వైరస్ దెబ్బకు OTT డామినేషన్ ఎక్కువవ్వడంతో సినిమా థియేటర్స్ భవిష్యత్తు భయానకంగా మారుతోంది. అసలు రానున్న రోజుల్లో థియేటర్స్ ఉంటాయో లెదో అనేలా కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. మొదలైతే థియేటర్స్ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉండవచ్చని ఇప్పటికే కొందరు గ్రహించారు. ఇక షూటింగ్స్ పూర్తి చేసి సినిమాలను సిద్ధం చేసిన నిర్మాతల పరిస్థితి ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో ఉన్న నిర్మాతలతో దిల్ రాజు ఒకరు. నాని V సినిమాను పూర్తి చేసి రెడీగా ఉంచిన సమయంలో ఉహీంచని విధంగా క్యాన్సిల్ అయ్యింది. వచ్చే దసరా సమయంలో పరిస్థితులు అనుకూలిస్తే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సంక్రాంతికి కూడా కరోనా ఎఫెక్ట్ తప్పలా లేదనిపిస్తోంది. దీంతో V కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఈ సినిమాను ఆహా యాప్ లో విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ మొదట దిల్ రాజుతో చర్చలు జరిపాడు. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు మరింత ఆలస్యం అవ్వడమే కాకుండా భవిష్యత్తులో విడుదల చేస్తామన్న గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పుడే వచ్చిన రేటుకు సినిమాను అల్లు అరవింద్ కి అమ్మేస్తే బెటర్ అని దిల్ రాజుకి సలహాలు అందుతున్నాయట. కానీ అందుకు ఆయన ఏ మాత్రం మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.