Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ.ఎన్టీఆర్ ఒత్తిడితోనే ‘ఊసరవెళ్లి’ ఆడియో
ఊసర వెళ్లి ఆడియో రిలీజ్ వేడుకను ఈ రోజు(సెప్టెంబర్ 15)న శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం....జూ.ఎన్టీఆర్ ఒత్తిడి మేరకే ఈ సినిమా ఆడియో వేడుక ఇంత హడావుడిగా చేస్తున్నారని సమాచారం. అక్టోబర్ 6న సినిమా విడుదల చేస్తున్నట్లు వెలువడిన ప్రకటన కూడా జూనియర్ బలవంతం మీదనే విడుదల చేశారట.
వాస్తవానికి ఊసరవెళ్లి షూటింగ్ 30% కూడా పూర్తి కాలేదనే వాదన ఆ సినిమా యూనిట్ సభ్యుల నుంచి వినిపస్తోంది. దీపావళి వరకు అయితే సినిమాను హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చని నిర్మాతలతో పాటు, దర్శకుడు సుంరేదర్ రెడ్డి జూనియర్ నచ్చజెప్పినా ఆయన వినలేదని, దసరా సెలవుల సీజన్ వదులకోవడానికి జూనియర్ సిద్దంగా లేక పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో...ఊరసవెళ్లి షూటింగ్ గత కొన్ని రోజుల నుంచి ఆగమేఘాల మీద జరుపుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇలా ఆదరబాదరాగా షూటింగ్ జరుపుకుంటే సినిమా ఆగం అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు వాదన. మరి ఊసరవెళ్లి గతేమవుతుందో? చూడాలి.