twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమాని కోసం స్వయంగా రంగంలోకి జూ ఎన్టీఆర్...!?

    By Sindhu
    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన చిత్రం ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. విడుదలకు ముందే ఈ చిత్రం మంచి ఊపు అందుకుంది. భారీ గా అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ బ్రహ్మాండమైన రేటు ఇచ్చి దక్కించుకుంది.

    అయితే ఇప్పుడు సరికొత్త మలుపు ఒకటి వెలుగు లోకి వచ్చింది. విశాఖపట్నం లో జూ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఈ చిత్రం కథ, నిర్మింపబడిన తీరు చూసి బాగా ఇష్టపడ్డాడు అట. ఎలాగైనా ఈ చిత్రం ప్రదర్శన హక్కులను విశాఖపట్నం వరకు అయినా దక్కించుకోవాలని పట్టుదలతో విశ్వప్రయత్నం చేసాడంట. అయితే అప్పటికే హక్కులను పొందిన ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ, నిర్మాత ప్రసాద్ తో స్వయంగా జూ ఎన్టీఆర్ సంప్రదించి తన అభిమానికి విశాఖపట్నం హక్కులను ఆ వ్యక్తికి ఇప్పించినట్టు సమాచారం. ఈ వీరాభిమానికే సుమారు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు ఇచ్చేసారని సమాచారం. ఫిలింనగర్ లో సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పుకుంటూ ఉండటం తో ప్రదర్శన హక్కులకు గిరాకి బాగా పెరిగిపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

    English summary
    There were discussions between the Producer, NTR and R.R.Movie Makers, and the Vishakapatnam rights were sold to this fan for a whopping price of around Rs.3.3 Crores. According to the talks in filmnagar right now, the movie has reportedly come out rather well and that is the reason behind the confidence of the distributors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X