Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అభిమాని కోసం స్వయంగా రంగంలోకి జూ ఎన్టీఆర్...!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన చిత్రం ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. విడుదలకు ముందే ఈ చిత్రం మంచి ఊపు అందుకుంది. భారీ గా అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ బ్రహ్మాండమైన రేటు ఇచ్చి దక్కించుకుంది.
అయితే ఇప్పుడు సరికొత్త మలుపు ఒకటి వెలుగు లోకి వచ్చింది. విశాఖపట్నం లో జూ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఈ చిత్రం కథ, నిర్మింపబడిన తీరు చూసి బాగా ఇష్టపడ్డాడు అట. ఎలాగైనా ఈ చిత్రం ప్రదర్శన హక్కులను విశాఖపట్నం వరకు అయినా దక్కించుకోవాలని పట్టుదలతో విశ్వప్రయత్నం చేసాడంట. అయితే అప్పటికే హక్కులను పొందిన ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ, నిర్మాత ప్రసాద్ తో స్వయంగా జూ ఎన్టీఆర్ సంప్రదించి తన అభిమానికి విశాఖపట్నం హక్కులను ఆ వ్యక్తికి ఇప్పించినట్టు సమాచారం. ఈ వీరాభిమానికే సుమారు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు ఇచ్చేసారని సమాచారం. ఫిలింనగర్ లో సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పుకుంటూ ఉండటం తో ప్రదర్శన హక్కులకు గిరాకి బాగా పెరిగిపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.