twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేటు పెంచిన పవిత్రా లోకేష్.. వీకే నరేష్ అఫైర్ తర్వాత మరింత జోరు.. రోజుకు రెమ్యునరేషన్ ఎంతంటే?

    |

    తల్లి, అక్క పాత్రలతో తెలుగు సినిమాల్లో రాణిస్తున్న నటి పవిత్రా లోకేష్ గురించి పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు. కానీ సీనియర్ నటుడు వీకే నరేష్‌తో సహజీవనం విషయం బయటకు పొక్కిన ఆమె వ్యవహారం తర్వాత దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైసూరులో నరేష్‌తో పట్టుబడిన తర్వాత పవిత్రా లోకేష్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె తన పారితోషికాన్ని పెంచిన వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవిత్రా లోకేష్ పెంచిన పారితోషికం వివరాల్లోకి వెళితే..

    వీకే నరేష్‌తో రిలేషన్‌షిప్‌తో

    వీకే నరేష్‌తో రిలేషన్‌షిప్‌తో

    పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ నటిగా పవిత్రా లోకేష్‌కు గొప్పగా పేరు రాలేదు. ఎప్పుడైతే సమ్మోహనం మూవీలో వీకే నరేష్‌తో రిలేషన్‌షిప్ మొదలు పెట్టిందో.. అప్పటి నుంచి ఆమె గురించి మీడియాలో కథలు కథలుగా కథనాలు వెలువడ్డాయి. అయితే వీకే నరేష్ గానీ, ఆమె గానీ తమ బంధాన్ని ఎన్నడూ బహిరంగంగా మీడియాకు వెల్లడించలేదు. వారి మధ్య సీక్రెట్‌గా సహజీవనం కొనసాగుతున్న సమయంలో వీకే నరేష్ భార్య చేసిన ఆరోపణలతో వారి రిలేషన్‌ను వీకే నరేష్ బయటపెట్టాడు.

    మైసూర్‌ హోటల్‌లో

    మైసూర్‌ హోటల్‌లో

    వీకే నరేష్ మూడో భార్య బెంగళూరులో మీడియా సమావేశం పెట్టి తనకు విడాకులు ఇవ్వలేదనే విషయాన్ని స్పష్టం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే నాలుగో పెళ్లికి సిద్దమవుతున్నాడనే విషయాన్ని బట్టబయలు చేసింది. తన మూడో భార్య చేసిన ఆరోపణలను వీకే నరేష్ ఖండించారు. దాంతో పవిత్రా లోకేష్ రిలేషన్‌షిప్ వ్యవహారం మీడియాలో వివాదంగా మారింది. అయితే మైసూరులో వీకే నరేష్‌తో హోటల్‌లో పట్టుబడటం మరింత వివాదంగా మారింది.

    థియేటర్లలో గోల గోల

    థియేటర్లలో గోల గోల

    అయితే వీకే నరేష్‌ సహజీవన వివాదం తర్వాత పవిత్రా లోకేష్ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజైంది. వీకే నరేష్, పవిత్రా లోకేష్ కాంబినేషన్‌లో కొన్ని సీన్లు ఉన్నాయి. అయితే వీరిద్దరూ తెర మీద కనిపించినప్పుడు థియేటర్లో కేకలు, అరుపులతో రచ్చగా మారింది. రవితేజ, హీరోయిన్లు స్క్రీన్ మీద కనిపిస్తే.. ఫ్యాన్స్‌లో అంత జోష్ కనిపించలేదు. అలాంటి క్రేజ్ పవిత్రా లోకేష్, వీకే నరేష్ జంటకు రెస్పాన్స్ వచ్చింది.

    పవిత్రా లోకేష్‌కు చేతినిండా ప్రాజెక్టులు

    పవిత్రా లోకేష్‌కు చేతినిండా ప్రాజెక్టులు

    ప్రస్తుతం పవిత్రా లోకేష్‌కు చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. బాలు శర్మ దర్శకత్వంలో నీతో చిత్రంలో రాజీవ్ కనకాలతో కలిసి నటిస్తున్నారు. అలాగే కన్నడలో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న సప్త సాగారదాచే ఎల్లో సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఉగ్రవతారలో సుమన్, అజయ్, ప్రియాంక ఉపేంద్రతో కలిసి నటిస్తున్నారు. అలాగే రాంపూర్ 0 కిలోమీటర్లు అనే సినిమాలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది. ఇంకా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, నరేష్‌తో కలిసి తెలిసినవాళ్లు అనే చిత్రంలో నటిస్తున్నది.

    భారీగా పారితోషికాన్ని పెంచేసిన పవిత్రా లోకేష్

    భారీగా పారితోషికాన్ని పెంచేసిన పవిత్రా లోకేష్


    అయితే పవిత్రా లోకేష్ తాను నటించే సినిమాలు సక్సెస్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా భారీగా రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. గతంలో ఆమె రోజు వారీ కాల్షిట్ ప్రకారం రోజుకు 60 వేల రూపాయలు పారితోషికంగా అందుకొనేది. ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ను రోజకు లక్ష రూపాయలకు పెంచినట్టు జాతీయ మీడియాలో కథనం వెలువడింది. దీంతో పవిత్రా లోకేష్‌ తన క్రేజ్‌ను, డిమాండ్‌ను క్యాష్ చేసుకొంటున్నారనే వాదన వినిపిస్తున్నది.

    English summary
    Pavithra Lokesh increased remuneration after opened relationship with VK Naresh. She has appeared in Mahalakshmi role in Rama Rao on Duty. Earlier, her salary was 60k. Now she increased to 1 Lakh rupees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X