Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ మూవీకి అప్పుడే రూ. 55 కోట్లు బిజినెస్?
ఇందంతా పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ప్రభావంతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అని చెప్పక తప్పదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి మరో ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఈచిత్రానికి థియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో, డిజిటల్ మ్యూజిక్ డీల్స్ కూడా కుదిరాయని తెలుస్తోంది.
వీటి రూపంలో నిర్మాత విడుదలకు ముందే రూ. 55 కోట్ల వరకు వసూలు అవుతున్నాయని టాక్. ఈ సినిమాతో నిర్మాత భారీ లాభాలు ఖాయమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్లాపు సినిమాలు కూడా రూ. 40 కోట్లు వసూలు చేసిన సందర్భాలున్నాయని, 'జల్సా' లాంటి హిట్ కాంబినేషన్ కాబట్టి రూ. 55 కోట్లు విడుదల ముందే రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ యూరఫ్లో జరుగుతోంది. అక్కడ పవన్ కల్యాణ్, హీరోయిన్స్ సమంత, ప్రణీతలపై రెండు పాటలను, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.