Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రెండు చిత్రాలు ఒకేసారి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా
Recommended Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించే సమయం అతి దగ్గర్లోనే ఉంది. సోమవారం (జనవరి 20) పింక్ రీమేక్ షూటింగ్లో పాల్గొన్నాడు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్లో పవన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవుడ్ డోర్ షూటింగ్ కావడంతో పవన్ పిక్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి. తమ అభిమాన హీరో వెండితెరపై మళ్లీ కనిపించనున్నాడు, మొదటి రోజు షూటింగ్ను కూడా పూర్తి చేసేశాడని తెలిశాక పవన్ ఫ్యాన్స్లో ఆనందం రెట్టింపైంది.
ఎన్నో రోజుల ఎదురుచూపులు..
గత కొన్ని నెలల నుంచి పవన్ కళ్యాణ్ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం, ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో అందరూ డైలామాలో ఉండేవారు. తమ హీరోను ఎప్పుడెప్పుడు 70 ఎమ్ఎమ్ స్క్రీన్పై చూస్తామా? అని చూసిన ఎదురుచూపులకు కాలం చెల్లినట్టే.
పింక్ రీమేక్ మొదలు..
బాలీవుడ్లో అమితాబ్ ప్రధాన పాత్రలో వచ్చిన పింక్ చిత్రం ఘనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్లో కూడా రీమేక్ చేశారు. అక్కడా మంచి విజయాన్ని సాధించింది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్లో పవన్ కూడా జాయిన్ అయ్యాడు.
క్రిష్తో సినిమా..
వేదం, కృష్ణం వందే జగద్గురు, కంచె వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్. చివరగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. దర్శకుడిగా మాత్రం క్రిష్ తన ప్రతిభను చూపించాడు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్తో క్రిష్ సినిమా చేయబోతోన్నాడని, పీరియాడిక్ డ్రామా అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతూ ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
షూటింగ్ ప్రారంభం..
ఏ ఎమ్ రత్నం నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటించబోతోన్నాడని టాక్. ఈ సినిమా మొఘలుల కాలం నాటికి సంబంధించినది ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ జనవరి 27 నుంచి మొదలు కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే.. అటు పింక్ రీమేక్, ఇటు క్రిష్ సినిమాలతో ఫ్యాన్స్కు డబుల్ ధమాకా ఉండబోతోన్నట్లే.