Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హాట్ న్యూస్ : NRI గా పవన్ కల్యాణ్
ఈ చిత్రం గురించి నిర్మాత చెప్తూ...''ఆద్యంతం సరదాలు పంచే కథ ఇది. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. 'జల్సా'కి మించిన వినోదం అందించే ప్రయత్నం చేస్తున్నాం. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు'' అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరో ప్రక్క ఈ చిత్రంతో బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం మార్చి 1 నుంచి సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' మూవీ మంచి కామెడీ పండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్లా ఉంటుందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.
'జల్సా'తో సంజయ్ సాహుగా వినోదాన్ని పంచారు వవన్ కల్యాణ్. ఆయన నటన అభిమానులను అలరించింది. త్రివిక్రమ్ ఈ కథని తీర్చిదిద్దిన విధానం ఈ చిత్ర విజయంలో ముఖ్య భూమిక పోషించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి వినోదాల విందు పంచడానికి సిద్ధమయ్యారు. 'సరదా' అనే పేరు పరిశీలనలో ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. సమంత హీరోయిన్. సహనిర్మాతలు: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, భోగవల్లి బాపినీడు.