పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే వేదికపై, ఎప్పుడో తెలుసా?
Recommended Video

అల్లుఅర్జున్-అను ఇమ్మాన్యుయేల్ జంటగా టాలీవుడ్లో రానున్న మూవీ 'నాపేరు సూర్య'. వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఇటీవల విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఆడియో వేడుకకు మెగా హీరోలందరు ఒకే వేదికపై కనిపించబోతున్నారని సమాచారం.

సూర్య పై భారి అంచనాలు..
అల్లుఅర్జున్-అను ఇమ్మాన్యుయేల్ జంటగా టాలీవుడ్లో రానున్న మూవీ 'నాపేరు సూర్య'. వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఇటీవల విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

అదంతా పుకారే...
నాపేరు సూర్య సినిమాకు సంభందించి ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం హాలీవుడ్ కాపీయేనంటూ సోషల్మీడియాలో ప్రచారం జోరందు కుంది. 2002లో వచ్చిన 'యాంట్వోన్ ఫిషర్' సినిమాను కాపి కొట్టి ఈ సినిమా తీసారని వచ్చిన వార్తలో నిజం లేదని సమాచారం. తాజాగా చిత్ర యూనిట్ కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది.

అర్జున్ కోసం పవన్
తాజాగా పవన్ కళ్యాణ్ చాంబర్ లో నిరసన తెలుపడానికి వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, చరణ్ ఛాంబర్ కు వచ్చి తమ మద్దతు తెలపడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాపేరు సూర్య సినిమాకు సంభందించిన ఆడియో ఫంక్షన్ ఈ నెల 29న హైదరాబాద్ లో జరగనుంది ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చిరు పవన్ ఒకే వేదికపై
నా పేరు సూర్య సినిమాకు నాగబాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. నాగబాబు పవన్ ను ఆడియో వేడుకకు పిలిచినట్లు సమాచారం. దాదాపు పవన్ ఈ వేడుకకు రావడం ఖాయనని చెబుతున్నారు కొందరు మెగా అభిమానులు. బన్ని పవన్ కు మద్దతు తెలిపాడు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్, బన్ని ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు సమాచారం. చిరంజీవి కూడా ఈ ఫంక్షన్ కు రాబోతున్నాడు. మెగా హీరోలందరూ ఒకే వేదికపై కనిపించబోతుండడం విశేషం.


Click it and Unblock the Notifications











