Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కన్ఫ్యూజన్ క్లియర్.. పవర్స్టార్ నిర్ణయం మారిందట! ఇక చెడుగుడే..
ఎన్నికలకు ముందు పవన్ సినిమా చేస్తాడా లేదా అనేది సందేహంగానే మిగిలిపోయింది. తాజాగా పవన్ ఓ సినిమా చేస్తున్నాడనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది.
Recommended Video
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై అని పవన్ కల్యాణ్ చెప్పడంతో ఫ్యాన్స్కు గుండె పగిలినంత పనైంది. రాజకీయాల్లోనే కొనసాగుతూ ఏడాదికో సినిమా చేస్తే బాగుండని అభిమానులు కోరుకొన్నారు. అయితే ఎన్నికలకు ముందు పవన్ సినిమా చేస్తాడా లేదా అనేది సందేహంగానే మిగిలిపోయింది. తాజాగా పవన్ ఓ సినిమా చేస్తున్నాడనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది.
సినిమాపై సానుకూలం
రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందే ఓ సినిమాలో నటిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలు చేసేందుకు సానుకూలంగా ఉన్నారు. మార్చి చివరి వారంలో గానీ, ఎప్రిల్లో గానీ కొత్త సినిమా పట్టాలెక్కనున్నదట.
పరిమితమైన కాల్షిట్లతో
జనసేన పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తూనే సినిమాను పూర్తి చేయాలని పవర్ స్టార్ భావిస్తున్నాడట. సినిమా కోసం పరిమితమైన కాల్షీట్లు కేటాయించి రాజకీయ పనుల్లో నిమగ్నమవుతాడట. పరిమితమైన కాల్షీట్లతో పవన్ కల్యాణ్తో సినిమా పూర్తి చేసే దర్శకుడి ఎవరు అనేది ఫిలింనగర్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది.
ఏఎం రత్నంతో చిత్రం
అజ్ఞాతవాసి చిత్రానికి ముందే ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించే చిత్రంలో నటించేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవన్ చేతుల మీదుగా ముహుర్తం కార్యక్రమాలు జరిగాయి. అయితే రాజకీయ కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టడంతో అది నిలిచి పోయిందని ప్రచారం జరిగింది.
ఇరుకు పడ్డ పవన్ కల్యాణ్
అదలా ఉండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఓ చిత్రాన్ని చేసేందుకు పవన్ కల్యాణ్ అడ్వాన్స్ పుచ్చుకొన్నారట. అడ్వాన్స్ వ్యవహారంపై మైత్రీ మూవీస్ అధినేతలు సీరియస్గా ఉండటం పవన్ను ఇరుకున పెడుతున్నదట. అయితే ఆ సినిమాను చేయకపోతే భారీ మొత్తాన్ని వారికి చెల్లించాల్సి ఉంటుందట.
పవన్ దారెటు..
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఏఎం రత్నం సినిమాకే పవన్ ఓటేస్తాడని మరో మాట కూడా ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఈ వార్త నిజమైతే అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.