Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. పాలిటిక్స్ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమవ్వడంతో ఒక్క సినిమా వచ్చినా చాలురా దేవుడా అని అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక నెక్స్ట్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)
రెండు వైపులా సమన్యాయం
పవన్ కళ్యాణ్ తన లిస్ట్ లో ఉన్న సినిమాల్లో మొత్తానికి వకీల్ సాబ్ ను అయితే పూర్తి చేశాడు. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పవన్ తన రెగ్యులర్ పాలిటిక్స్ ను మాత్రం మిస్సవ్వడం లేదు. బిజీ షెడ్యూల్ లో రెండు వైపులా సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
సెట్స్ పైకి మరో రెండు సినిమాలు
ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనంతరం మరో రెండు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవల అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను 40రోజుల్లోనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక మరోవైపు క్రిష్ సినిమా షూటింగ్ స్పీడ్ కూడా పెంచనున్నాడు.
మహేష్ చేయాల్సిన కథలో..
హరీష్ శంకర్ దర్శకత్వంలో అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్న విషయం తెలిసిందే. వాటితో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా మహేష్ బాబు చేయాల్సిన ప్రాజెక్ట్ అని రూమర్స్ వస్తున్నాయి. గత పదేళ్లుగా ఆ కథ సెట్స్ పైకి రావడానికి ప్రయత్నం చేస్తోంది.
మహేష్ ఇంట్రెస్ట్ చూపడం లేదని..
దర్శకుడు పూరి జగన్నాథ్ 'జగణమన' అనే ఒక ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తేవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాను తీస్తే అగ్ర హీరోతోనే, అనుకున్న బడ్జెట్ లోనే తీయాలని పూరి జగన్నాథ్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇక ఆ సినిమాపై మహేష్ బాబు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని అప్పట్లో టాక్ గట్టిగానే వచ్చింది.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్
ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కు చెప్పి ఒప్పించాలని పూరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పైగా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం అలాంటి మంచి సందేశాత్మక సినిమాలను తియాలనే ఎదురుచూస్తున్నాడు. ఇక పూరి జగన్నాథ్ అంటే సినిమా షూటింగ్ కు పెద్దగా సమయాన్ని తీసుకొడు కాబట్టి తొందరగా ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
Recommended Video