Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్ నిరాశ
హైదరాబాద్ : పవన్ సినిమా వస్తోందంటే అభిమానుల్లో ఆనందం చెప్పనలవి కాదు. అందుకు తగినట్లుగానే పవన్ అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఫెరఫెక్ట్ ప్యాకేజీతో తన చిత్రాలను తీసుకువస్తూంటారు. అయితే ఇప్పుడు పవన్ తాజా చిత్రంలో కేవలం ముప్పై నిముషాలు పాటే కనిపిస్తాడని తెలియటంతో కొందరు అభిమానులు నిరాశపడుతున్నారు. పవన్ కోసం వెళ్ళే అభిమానులు నిరాశపడకుండా ఉండేందుకు పవన్ పాత్ర లెంగ్త్ పెంచవచ్చు కదా అంటున్నారు. ఇప్పటికే మీకు అర్దమైపోయి ఉంటుంది. ఇదంతా ఏ చిత్రం కోసమో...అదే కొత్తగా లాంచ్ అయిన 'గోపాల గోపాల' చిత్రం కోసం.
తెలుగు తెరపై మరిన్ని మల్టీస్టారర్ సినిమాలకు సమయం ఆసన్నమైంది . అందులో భాగంగానే వెంకటేష్, పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్' సినిమాను వీరిద్దరూ తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో 'గోపాల గోపాల' అనే పేరును నిర్ణయించారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో కేవలం పవన్ పాత్ర ముప్పై నిముషాలు మాత్రమే సాగుతుందని వినిపిస్తోంది.
వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్బాబు, శరత్మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి
పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.